Prime Minister Modi Vs Rahul|telugu news|modi|rahul|
లోక్సభలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న ప్రధాని మోదీ, రాహుల్ లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. రాహుల్ వ్యాఖ్యలకు మోదీ దీటుగా బదులిచ్చారు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ , అధిర్ రంజన్ ఛౌదురిపై విరుచుకుపడ్డారు. ‘మరో ఆరు నెలల్లో ప్రధానిని దేశంలోని యువత తరిమి తరిమి కొడతారని ప్రతిపక్షానికి చెందిన ఎంపీ అంటున్నారు.. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను.. మీరు మరిన్ని సూర్య నమస్కారాలు చేయండి.. ఇవి వేధింపులు ఎదుర్కోవటానికి నన్ను మరింత బలంగా చేస్తుంది... ఏదేమైనా, గత రెండు దశాబ్దాలుగా నాపై చేస్తున్న దుష్ప్రచారంతో మరింత రాటుదేలాను’ అని మోదీ విమర్శలు గుప్పించారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైన ప్రధాని మోదీని యువత తరమి కొడతారని రాహుల్ చేసిన విమర్శలకు మోదీ పై విధంగా స్పందించారు. ప్రధాని తన నివాసం