Dhoni into politics after retirement . Is in the BJP party?|telugu news|ciniwala|dhoni|BJP
రిటైర్ అయ్యాక పాలటిక్స్లోకి:
ఇంతకుముందు చాలామంది క్రికెటర్లు రిటైర్ అయ్యాక వెంటనే పాలటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇలా క్రికెట్ నుంచి రాజకీయాల వైపు అడుగులు వేసిన వారిలో మనోజ్ ప్రభాకర్, కీర్తి ఆజాద్, శ్రీశాంత్, అజరుద్దీన్, తాజాగా ఎంపీ గౌతం గంభీర్ ఉన్నారు. ఈ కోవాలోకే జార్ఖండ్ డైనమైట్ కూడా చేరనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే ధోనీ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.భారత మాజీ కెప్టెన్, వికెట్కీపర్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ అనంతరం బీజేపీ పార్టీలో చేరుతాడని కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ పాస్వాన్ తెలిపారు. ప్రపంచకప్లో భాగంగా బుధవారం న్యూజిలాండ్తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా చివరివరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచకప్లో భారత్ కథ సెమీస్తో ముగిసింది.రిటైర్మెంట్పై ఒత్తిడి:
సెమీఫైనల్లో ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) చివరకు వరకు పోరాడాడు. అయితే కీలక సమయంలో ధోనీ రనౌట్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ చేజారింది. ఈ ప్రపంచకప్లో భారత జట్టును ధోనీ చాలా సార్లే ఆదుకున్నాడు. అయితే స్ట్రైక్ రేట్ విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ మ్యాచుతో ధోనీ ధాటిగా బ్యాటింగ్ చేయకపోవడంతో రిటైర్మెంట్పై ఒత్తిడి పెరిగింది. ప్రపంచకప్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ఇస్తాడని అందరూ ఊహిచారు. కానీ అలా జరగలేదు
కమలం కండువా కప్పుకోనున్న ధోనీ:
కొంచెం లేట్ అయినా ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడు. రిటైర్మెంట్ అంతరం ధోనీ ఏం చేస్తాడు అని అందరిలో ఓ ప్రశ్న. అయితే రిటైర్మెంట్ అనంతరం మహీ బీజేపీ పార్టీలో చేరుతాడని కేంద్ర మాజీమంత్రి సంజయ్ పాస్వాన్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ధోనీ నాకు చాలా కాలంగా తెలుసు. అతను నాకు మంచి స్నేహితుడు. అతనొక ప్రపంచ ఆటగాడు. అతన్ని బీజేపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. ధోనీ రిటైర్మెంట్ అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు' అని పాస్వాన్ అన్నారు.
Comments
Post a Comment