Dhoni joins Army battalion .. job in Kashmir|telugu news|ciniwala|dhoni
ఆర్మీ బెటాలియన్తో కలిసిన ధోనీ.. కశ్మీర్లో ఉద్యోగం బెంగళూరు: మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్ విభాగంలో తన రెండు నెలల శిక్షణను ప్రారంభించాడు. బుధవారం ధోనీ బెటాలియన్తో కలిసాడు. ధోనీ లెఫ్టినెంట్ కల్నల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కశ్మీర్లో ఉద్యోగం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్తో కలిసి ధోనీ పనిచేయనున్నాడు. కశ్మీర్లో ఉన్న విక్టర్ ఫోర్స్తో ధోనీ కలవనున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్తో శిక్షణ ప్రారంభిస్తాడు. పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీలను ధోనీ నిర్వర్తించనున్నాడు. భద్రతా దళాలతో 15 రోజులు పాటు ధోనీ గడపనున్నాడు. 'భారత క్రికెట్ గొప్ప సేవకులలో ధోనీ ఒకడు. సాయుధ దళాల పట్ల ఆయనకున్న ప్రేమ కూడా అందరికీ తెలుసు. ఆర్మీతో పనిచేయాలని అతని ఆలోచన అద్భుతం. ఆర్మీతో మంచి సమయం గడపాలని కోరుకుంటున్నా. యువతలో అవగాహన పెంచడానికి కూడా సహాయపడుతుంది' అని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. పారామిలటరీ రెజిమెంట్లో సేవలందించేందుకు రెండు నెలల పాటు భారత జట్టుకు అందుబాటులో ఉండ