Posts

Showing posts from July, 2019

Dhoni joins Army battalion .. job in Kashmir|telugu news|ciniwala|dhoni

Image
ఆర్మీ బెటాలియ‌న్‌తో కలిసిన ధోనీ.. క‌శ్మీర్‌లో ఉద్యోగం బెంగళూరు: మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్‌ విభాగంలో తన రెండు నెలల శిక్షణను ప్రారంభించాడు. బుధవారం ధోనీ బెటాలియన్‌తో కలిసాడు. ధోనీ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. క‌శ్మీర్‌లో ఉద్యోగం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు. క‌శ్మీర్‌లో ఉన్న విక్ట‌ర్ ఫోర్స్‌తో ధోనీ క‌ల‌వ‌నున్నాడు. అక్కడ పారాచూట్ రెజిమెంట్‌తో శిక్షణ ప్రారంభిస్తాడు. పెట్రోలింగ్‌, గార్డ్‌, పోస్ట్ డ్యూటీల‌ను ధోనీ నిర్వర్తించనున్నాడు. భ‌ద్ర‌తా ద‌ళాల‌తో 15 రోజులు పాటు ధోనీ గ‌డ‌ప‌నున్నాడు. 'భారత క్రికెట్ గొప్ప సేవకులలో ధోనీ ఒకడు. సాయుధ దళాల పట్ల ఆయనకున్న ప్రేమ కూడా అందరికీ తెలుసు. ఆర్మీతో పనిచేయాలని అతని ఆలోచన అద్భుతం. ఆర్మీతో మంచి సమయం గడపాలని కోరుకుంటున్నా. యువతలో అవగాహన పెంచడానికి కూడా సహాయపడుతుంది' అని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. పారామిలటరీ రెజిమెంట్‌లో సేవలందించేందుకు రెండు నెలల పాటు భారత జట్టుకు అందుబాటులో ఉండ

Bigg Boss Season 3 Final List Leak|Telugu film news | ciniwala |nagarjuna

Image
బిగ్ బాస్.. సీజన్ 3 జూలై 21 (ఆదివారం) ప్రారంభం కానుంది. హోస్ట్‌గా నాగార్జున వస్తుండటంతో బుల్లితెర ప్రేక్షకుల్లోనే కాకుండా వెండితెర ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి ఏర్పడింది. 100 రోజులపాటు ఈ షో కొనసాగనుంది. మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లబోయే ఆ 15 సెలబ్రిటీలు ఎవరన్నదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది. కాగా.. బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజుల పాటు సందడి చేయబోయే సెలబ్రిటీలు వీరే అంటూ వీడియో విడుదల చేశారు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు. యూట్యూబ్‌లో ఫొటోలతో సహా కంటెస్టెంట్ పేర్లను విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ 15 మంది సెలబ్రిటీలు ఎవరంటే.. 1. నటి హేమ 2. యాంకర్ శ్రీముఖి 3. తీన్మార్ యాంకర్ సావిత్రి 4. నటి హిమజా రెడ్డి 5. వరుణ్ సందేశ్, వితికా షెరు (జంట) 7. సీరియల్ యాక్టర్ రవిక్రిష్ణ 8. టీవీ యాక్టర్ అలీ రెజా 9. టీవీ 9 జర్నలిస్ట్ జాఫర్ 10. పునర్వీ భూపాలం 11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ 12. సింగర్ రాహుల్ 13. యూట్యూబ్ స్టార్ మహేష్ 14. టీవీ నటి రోహిణి 15. డస్మాష్ స్టార్ అషూ రెడ్డి

Jaggubhai Clarity on the movie| Telugu film news | ciniwala |sarileru neekevvaru

Image
మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు.. ఆర్మీ అధికారి పాత్రలో నటిస్తున్నాడు. ఐతే.. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర కోసం సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తి బాబును ఎంచుకున్నారు. ఐతే ఇటీవ‌ల ఆ సినిమా నుంచి జ‌గ‌ప‌తిబాబు త‌ప్పుకున్నారు. జగ్గూభాయ్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం వెనక అనిల్ రావిపూడితో ఉన్న విభేదాలే కారణమని వార్తలు వినబడ్డాయి. తాజాగా ఈ పుకార్లుకు పులిస్టాప్ పెడుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై జగపతి బాబు ఓ వీడియోను విడుదల చేసాడు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో తాను ఒక క్యారెక్టర్ చేయాల్సి ఉన్న.. పర్సనల్ కారణాలతో స్వచ్ఛందంగా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. నేను నా 33 ఏళ్ల కెరీర్‌లో ఎవరితో గొడవ పడింది లేదంటూ ఓ వీడియోను విడుదల చేసాడు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘సరిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలోని పాత్ర‌ను జ‌గ‌ప‌తిబాబు చాలా ఇష్ట‌ప‌డ్డారు. ఈ ప్రాజెక్టులో భాగం కావాల‌ని ఆయ‌న భావించారు. అయితే కొన్ని అనివార్య కార‌

Samantha and Chinmayi dragged netizens into Bigg Boss conflict| Telugu film news | ciniwala | samantha

Image
బిగ్ బాస్ వివాదంలోకి సమంత – చిన్మయిని లాగిన నెటిజన్లు గత కొద్దీ రోజులుగా కాస్టింగ్ కౌచ్, లైగింక వేదింపుల విషయంలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సమంత.. చిన్మయిలకు నెటిజన్లు దిమ్మ తిరిగే ప్రశ్నలు వేస్తున్నారు. నేను చెప్పే నీతులు ఇతరులకు మాత్రమేనా ?మీకు వర్తించవా? అంటూ సమంత.. చిన్మయి లపై నెటిజన్స్ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నాయి. ఎక్కడైనా చిన్న కాస్టింగ్ కౌచ్ విషయం కనిపించినా లేదంటే లైగింక వేదింపుల వార్త కనిపించినా కూడా వెంటనే తన సోషల్ మీడియా పేజ్ లో చిన్మయి ఆ విషయాన్ని పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఆమద్య ఏదో లైంగిక వేదింపుల వార్త రాగానే అది నిజమేనా అనే విషయం కూడా తెలుసుకోకుండా పోస్ట్ చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. అంత ఉత్సాహంగా లైంగిక వేదింపుల కేసుల విషయంలో చురుకుగా ఉండే చిన్మయి తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న బిగ్ బాస్ కాస్టింగ్ కౌచ్ విషయంలో మాత్రం స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. బిగ్ బాస్ కాస్టింగ్ కౌచ్ గురించి సమంత మరియు చిన్మయి నోరు విప్పాల్సిందే అంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు తమను ఇబ్బంది పెట్టారంటూ శ్వేత రెడ్డి మరియు గాయత్ర

Anushka is also follow Prabhas | Telugu film news | ciniwala | Anushka

Image
బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎంత పాపులర్ అయ్యాడో అందరికి తెలిసినదే, ఆ పాపులారిటీ తో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు, అతి తక్కువ సమయంలోనే ఎక్కువమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు , ప్రభాస్ అయితే ఈ సినిమాలో నటించిన మిగిలిన నటీనటులు కూడా కాస్తో కూస్తో పాపులారిటీని, ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నప్పటికీ అది తమ తరువాతి సినిమాలకి పెద్దగా ఉపయోగపడలేదు, కానీ అనుష్క మాత్రం ప్రభాస్ రేంజ్ లో కాకపోయినా తనకి దగ్గరగా అభిమానులను సొంతం చేసుకుంది, బాహుబలి లో అనుష్క చేసిన నటనకి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు, దెబ్బతో ఆమె కూడా పాపులర్ అయిపొయింది, ఇక ఈ పాపులారిటీ ని ప్రభాస్ అనుష్క ఇద్దరు కూడా తమ నెక్స్ట్ సినిమాలకు వాడుకొనే పనిలో పడ్డారు, ఇప్పటికే ప్రభాస్ బాహుబలి తో వచ్చిన క్రేజ్ ని పోనివ్వకుండా సాహూ సినిమాతో నిరూపించుకుంటున్నాడు, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నా సాహూ సినిమా ఇప్పటికే టీజర్ ని విడుదల చేసి ఇక్కడే కాదు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు అంత కాలేకపోయిన కొంచెం అయినా బాహుబలి క్రేజ్ ని అనుష్క కూడా ఉపయోగించుకోవాలని చూస్తుందట. ప్రభాస్‌లా భారీ సినిమా చేయలేక

Dhoni into politics after retirement . Is in the BJP party?|telugu news|ciniwala|dhoni|BJP

Image
రిటైర్ అయ్యాక పాలటిక్స్‌లోకి: ఇంతకుముందు చాలామంది క్రికెటర్లు రిటైర్ అయ్యాక వెంటనే పాలటిక్స్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఇలా క్రికెట్ నుంచి రాజకీయాల వైపు అడుగులు వేసిన వారిలో మనోజ్ ప్రభాకర్, కీర్తి ఆజాద్, శ్రీశాంత్, అజరుద్దీన్, తాజాగా ఎంపీ గౌతం గంభీర్ ఉన్నారు. ఈ కోవాలోకే జార్ఖండ్ డైనమైట్ కూడా చేరనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే ధోనీ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. భారత మాజీ కెప్టెన్, వికెట్‌కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ అనంతరం బీజేపీ పార్టీలో చేరుతాడని కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ పాస్వాన్‌ తెలిపారు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా చివరివరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచకప్‌లో భారత్‌ కథ సెమీస్‌తో ముగిసింది. రిటైర్మెంట్‌పై ఒత్తిడి: సెమీఫైనల్లో ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) చివరకు వరకు పోరాడాడు. అయితే కీలక సమయంలో ధోనీ రనౌట్ ఔట్ అవ్వడంతో మ్యాచ్ చేజారింది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టును ధోనీ చాలా సార్లే ఆదుకున్నాడు. అయితే స్ట్రైక్ రేట్ విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు

Fine to Roy who questioned the umpire's mistake|telugu news|ciniwala|Eng vs Aus|Jason roy

Image
హైలైట్స్ అంపైర్‌తో కాసేపు వాదనకు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్‌ జేసన్ రాయ్ లెగ్‌ సైడ్‌ వైడ్‌గా వెళ్లిన బంతికి ఔటిచ్చిన అంపైర్ ధర్మసేన అప్పటికే డీఆర్‌ఎస్ అవకాశాన్ని చేజార్చుకున్న ఇంగ్లాండ్ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్‌లో వరల్డ్‌కప్ ఫైనల్                                                                                                           .  ఆస్ట్రేలియాతో బర్మింగ్‌హామ్ వేదికగా గురువారం రాత్రి ముగిసిన వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌లో అంపైర్ తప్పిదాన్ని ప్రశ్నించిన ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌కి జరిమానా పడింది. ఈ మ్యాచ్‌లో 224 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు.. ఓపెనర్  జేసన్ రాయ్  (85: 65 బంతుల్లో 9x4) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 32.1 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. అయితే.. శతకం ముంగిట జేసన్ రాయ్ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. బ్యాట్‌కి బంతి తాకకపోయినా.. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. కాసేపు క్రీజులో నిరసన తెలిపిన జేసన్‌ రాయ్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే..? ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ షార్ట్ పిచ్

Beginning with runout ending with runout? Kohli's response to Dhoni's retirement|telugu news|ciniwaldhoni|kohli

Image
హైలైట్స్ వరల్డ్ కప్‌లో భారత్ ఆడే చివరి మ్యాచ్.. ధోనీ కెరీర్లో ఆఖరిది అయ్యే అవకాశం ఉందని గతంలో వార్తలొచ్చాయి. సెమీస్‌లో భారత్ ఓడాక.. ధోనీ రిటైర్ అవుతాడా? అనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయమై కోహ్లి స్పందించాడు. వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన టీమిండియా.. కేవలం 45 నిమిషాల చెత్త ఆటతో సెమీస్‌లో బోల్తా కొట్టింది. ఆదిలోనే టాప్ ఆర్డర్ కుప్పకూలిన తర్వాత ధోనీ, జడేజా భారత్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. మ్యాచ్‌ను ముగిస్తారనుకున్న తరుణంలో జడేజా అవుటవడంతో.. తర్వాత  ధోనీ  అనూహ్యంగా రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. వరల్డ్ కప్‌లో భారత్ ఆడే చివరి మ్యాచే.. ధోనీకి బ్లూ జెర్సీలో ఆఖరి మ్యాచ్ అని వార్తలొచ్చాయి. ధోనీ రిటైరవుతాడని ప్రచారం జరిగింది. కానీ ధోనీ మాత్రం రిటైర్మెంట్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు.  ధోనీ రిటైర్మెంట్  విషయమై ప్రెస్ మీట్‌లో కోహ్లిని ప్రశ్నించగా.. ఈ విషయంలో మహీ భాయ్ నాకే సమాచారం ఇవ్వలేదని విరాట్ తెలిపాడు. సెమీస్ మ్యాచ్‌లో జడ్డూ ఓ వైపు షాట్లు ఆడుతుంటే.. ధోనీ వికెట్ పడకుండా చూశాడన్న కోహ్లి... మహీ ఔటైతే..

Anusuya on the web series |telugu film news|ciniwala|anusuya

Image
జబర్దస్త్ షో వలన బుల్లితెరపైన మంచి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుందని యాంకర్ అనసూయ, ఈ షో కి ఆమె గ్లామర్ బాగా ప్లస్ అయ్యింది , ఎంట్రీ సాంగ్ తో రచ్చ రచ్చ చేస్తుంది, చిట్టి పొట్టి డ్రెస్సెస్ ధరించి ప్రేక్షకులకు మత్తెక్కిస్తోంది, దాంతో బుల్లితెరపైన మరిన్ని షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తుంది, అయితే అనసూయ తన హవాని ఒక బుల్లితెరపైనే కాదు వెండితెరపైన కూడా కొనసాగించాలని చూసింది, అందుకే అక్కడ కూడా అడుగు పెట్టేసింది, అడపాదడపా సినిమా అవకాశాలు చేజిక్కించుకుంటుంది గతేడాది సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి అందరిని అల్లాడించింది, ఆ ఒక్క పాత్రతో మంచి మైలేజ్ ని సొంతం చేసుకుంది, దెబ్బతో ఆఫర్స్ పైన ఆఫర్స్ ని చేజిక్కించుకుంది, కానీ అనసూయ కి రంగస్థలం ఇచ్చినంత మైలేజ్ మరో సినిమా ఇవ్వలేదు, దాంతో ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ పైన అనసూయ కన్నేసిందట. ఇప్పుడు అందరు కూడా వెబ్ సిరీస్ వైపే చూస్తున్నారు , సినిమాల కంటే ఎల్కువగా జనాలు కూడా అదే ఆదరించడంతో అందరు వెబ్ సిరీస్ వైపు అడుగులు వేస్తున్నారు , ఇదే నేపథ్యంలో అనసూయ కూడా వెబ్ సిరీస్ చెయ్యాలని నిర్ణయం తీసుకుందట. ఇండస్ట్రీ లో కూడా

India vs Kiwis 44 years later .. Fight again|telugu news|ciniwala|india vs kiwis

Image
ప్రపంచకప్‌లో 1975 నుంచి ఏడు సార్లు మాత్రమే భారత్, న్యూజిలాండ్ జట్లు ఢీకొన్నాయి. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా సెమీస్‌లో తలపడలేదు. అయితే.. ఈరోజు చరిత్రలో తొలిసారి తలపడిన స్టేడియంలోనే సెమీస్‌ పోరులో కాలు దువ్వుతున్నాయి. Samayam Telugu | Updated: Jul 9, 2019, 12:20PM IST హైలైట్స్ వరల్డ్‌కప్ చరిత్రలో తొలిసారి సెమీస్‌లో భారత్, కివీస్ ఢీ 1975లో ఫస్ట్ టైమ్ తలపడిన స్టేడియంలోనే మళ్లీ ఇన్నాళ్లకి ఫైట్ ప్రపంచకప్‌లో భారత్‌పై ఆధిపత్యం చెలాయించిన న్యూజిలాండ్ వన్డేల్లో మాత్రం కివీస్‌పై భారత్‌దే పైచేయి మ్యాచ్‌కి పొంచి ఉన్న వరుణుడి ముప్పు భారత్, న్యూజిలాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ సుదీర్ఘ చరిత్రలో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లూ ఏడుసార్లు తలపడగా.. న్యూజిలాండ్ 4 మ్యాచ్‌ల్లో,  భారత్  మూడింట్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. 

Because of Nagarjuna is keen to come to Bigg Boss Show |telugu film news|ciniwala|nagarjuna

Image
బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నట్లు ఉంది. అందుకే బిగ్ బాస్ సీజన్ 3 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూపులు చూస్తున్నారు. బిగ్ బాస్ కి బుల్లితెరపైన ఇంతటి ఆదరణ లభించడానికి ఒక రకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారణమని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి షో పైన మంచి హైప్ క్రియేట్ చేశారు, టాప్ రేటింగ్ లో దూసుకుపోయేలా చేశారు. వచ్చేది వారానికి రెండు రోజులే అయినప్పటికీ ఆ వారం మొత్తం ప్రేక్షకులకు అలాగే హౌస్ మేట్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి వెళ్ళేవారు. దాంతో షో మంచి రసవత్తరంగా సాగింది, మొత్తానికి బిగ్ బాస్ ని ఒక రేంజ్ లో నిలబెట్టారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇకపొతే సెకండ్ సీజన్ నాని వ్యాఖ్యాత గా వ్యవహరించి మంచి మైలేజ్ నే తెచ్చిపెట్టినప్పటికీ ఎన్టీఆర్ తరహాలో షో ని రక్తి కట్టించలేకపోయారు. రేటింగ్ కాస్త తగ్గినట్లుగానే కనిపించింది, అంతకుమించి నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ ఎఫెక్ట్ అతనికి బాగా కొట్టింది, తన సినిమాలపైనా ఆ ప్రభావం కనిపించడంతో మూడవ సీజన్ ససేమీరా చెయ్యడానికి ఒప్పుకోలేదు నాని. దాంతో మూడవ సీజన్ కి ఎవరు హోస్ట్ గా వస్తారా

Mohan Babu fans fires on Kalyan Ram | Telugu film news | ciniwala | kalyanram

Image
నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలపైనే సినిమాలు చేసుకుంటూ రేసులో ఉన్నారు. అంతేకాదు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు, కొత్త కొత్త కథలతో అభిమానుల ముందుకు వస్తున్నారు కానీ అబ్బాయికి మాత్రం పెద్దగా హిట్స్ వరించడం లేదు. కానీ ఎదో ఒక రకంగా కాస్తా డిమాండ్ ఉన్న కధలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ఉన్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ మల్లాడి వేణు దర్శకత్వంలో ‘రావణ’ అనే సినిమా చేస్తున్నారు, ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ విడుదలయ్యాయి. నందమూరి కళ్యాణ్ రామ్ సరి కొత్త లుక్ తో అభిమానులను అలరించారు. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు, దానికి కారణం మోహన్ బాబు అని చెప్పుకోవాలి. Mohan Babu fans fires on Kalyan Ram | Telugu movie news | Saakshyam ఎందులకంటే గత కొన్నాళ్ల క్రితం మోహన్ బాబు ఇదే టైటిల్ తో ఒక సినిమా చెయ్యాలని భావించారు. దానికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా చర్చలు దగ్గరే ఆగిపోయింది. ఇక ఇప్పుడు రావణ టైటిల్ తో కళ్యాణ్ రామ్ అభిమానుల ముందుకు రానున్నారు. దాంతో