India vs Kiwis 44 years later .. Fight again|telugu news|ciniwala|india vs kiwis
ప్రపంచకప్లో 1975 నుంచి ఏడు సార్లు మాత్రమే భారత్, న్యూజిలాండ్ జట్లు ఢీకొన్నాయి. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా సెమీస్లో తలపడలేదు. అయితే.. ఈరోజు చరిత్రలో తొలిసారి తలపడిన స్టేడియంలోనే సెమీస్ పోరులో కాలు దువ్వుతున్నాయి.
Samayam Telugu | Updated:
హైలైట్స్
- వరల్డ్కప్ చరిత్రలో తొలిసారి సెమీస్లో భారత్, కివీస్ ఢీ
- 1975లో ఫస్ట్ టైమ్ తలపడిన స్టేడియంలోనే మళ్లీ ఇన్నాళ్లకి ఫైట్
- ప్రపంచకప్లో భారత్పై ఆధిపత్యం చెలాయించిన న్యూజిలాండ్
- వన్డేల్లో మాత్రం కివీస్పై భారత్దే పైచేయి
- మ్యాచ్కి పొంచి ఉన్న వరుణుడి ముప్పు
భారత్, న్యూజిలాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ సుదీర్ఘ చరిత్రలో ఇప్పటి వరకూ ఈ రెండు జట్లూ ఏడుసార్లు తలపడగా.. న్యూజిలాండ్ 4 మ్యాచ్ల్లో, భారత్ మూడింట్లో గెలుపొందింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
Comments
Post a Comment