UP lineman cuts police station power supply|telugu news|ciniwala|uplineman
పోలీస్ స్టేషన్కు కరెంట్ కట్ చేసిన లైన్మ్యాన్.. భలే రివేంజ్!
రూల్కు రూల్తో సమాధానం ఇచ్చాడు ఆ ఎలక్ట్రీషియన్. పోలీస్ స్టేషన్కు విద్యుత్ సరఫరా నిలిపేసి ఝలక్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన లైన్మ్యాన్ శ్రీనివాస్ ఓ రోజు విద్యుత్తు లైన్లు తనిఖీ చేయడానికి బైక్ మీద వెళ్లాడు. దారి మధ్యలో పోలీసులు అతడిని అడ్డుకుని హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నందుకు ఫైన్ చెల్లించాలన్నారు
తాను అంతగా ప్రాధేయపడినా పోలీసులు వదిలిపెట్టకపోడంతో శ్రీనివాస్ బాధపడ్డాడు. రూల్కు రూల్తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తన సహచరులతో కలిసి ఆ జిల్లాల్లో విద్యుత్ బిల్లులు చెల్లించని పోలీస్ స్టేషన్ల జాబితా తయారు చేశాడు. వాటిలో తనకు జరిమానా విధించిన లైన్ పార్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది.
చిత్రం ఏమిటంటే.. ఆ పోలీస్ స్టేషన్ 2016, జనవరి నెల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో వారి బకాయిలు రూ.6,62,423కు చేరింది. మరి, లైన్మ్యాన్కు ఇంతకంటే మంచి కారణం ఏం కావాలి! దాన్ని ఆధారంగా చేసుకుని ఆ పోలీస్ స్టేషన్ కరెంట్ కట్ చేశాడు. నాలుగు గంటల సేపు సరఫరా ఆపేయడంతో పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదనే కారణంతోనే విద్యుత్ నిలిపినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘ఆ లైన్మ్యాన్పై డీవీవీఎన్ఎల్కు ఫిర్యాదు చేశాం. మా జిల్లా సూపరింటెండెంట్ నిబంధనలు ఉల్లంగించే పోలీసులనే వదిలిపెట్టరు. ఇప్పటివరకు 70 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. అలాంటిది ఎలక్ట్రీషియన్ను ఎలా వదిలిపెడతాం? బకాయి ఉన్న బిల్లులను చెల్లిస్తాం’’ అని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం తప్పే. అలాగే, రూల్స్ చెప్పే పోలీసులు కూడా వాటిని పాటించి.. ఆదర్శకంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చిత్రం ఏమిటంటే.. ఆ పోలీస్ స్టేషన్ 2016, జనవరి నెల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో వారి బకాయిలు రూ.6,62,423కు చేరింది. మరి, లైన్మ్యాన్కు ఇంతకంటే మంచి కారణం ఏం కావాలి! దాన్ని ఆధారంగా చేసుకుని ఆ పోలీస్ స్టేషన్ కరెంట్ కట్ చేశాడు. నాలుగు గంటల సేపు సరఫరా ఆపేయడంతో పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదనే కారణంతోనే విద్యుత్ నిలిపినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘ఆ లైన్మ్యాన్పై డీవీవీఎన్ఎల్కు ఫిర్యాదు చేశాం. మా జిల్లా సూపరింటెండెంట్ నిబంధనలు ఉల్లంగించే పోలీసులనే వదిలిపెట్టరు. ఇప్పటివరకు 70 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు. అలాంటిది ఎలక్ట్రీషియన్ను ఎలా వదిలిపెడతాం? బకాయి ఉన్న బిల్లులను చెల్లిస్తాం’’ అని తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం తప్పే. అలాగే, రూల్స్ చెప్పే పోలీసులు కూడా వాటిని పాటించి.. ఆదర్శకంగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Post a Comment